ఇంగ్లీష్ మీడియానికి తాము వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ భాష, సంస్కృతిని కాపాడాలన్నారు. ప్రభుత్వ పరంగా తెలుగును విస్మరిస్తామంటే కుదరదన్నారు. ఇంగ్లీష్ భాష అమలు వెనుక మతపరమైన కుట్ర ఉందన్నారు. ఒక మతాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తే ఊరుకోమన్నారు. ఆప్షన్ విధానం పెట్టాలన్నారు.