విజయవాడలో ఈనెల 12న ఇసుక మార్చ్ నిర్వహిస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. 13న జిల్లాల్లో ఇసుక మార్చ్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. వెలుగు ఉద్యోగుల తొలగింపు జీవోను ఉపసంహరించుకోవాలని, ఇంగ్లీష్ సమాంతరంగా తెలుగు, ఉర్ధూ భాషల్లో బోధించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరించే జీవోను వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ కోరారు.