న్యూఢిల్లి : పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మాంద్యంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు యత్నిస్తున్నారు. నవంబర్ 18వ తేదీనుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.