విశాఖపట్నం : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శనివారం నగరానికి రానున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు విజయవాడ నుంచి విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని రాత్రికి సర్క్యూట్హౌస్లో బసచేస్తారు.ఆదివారం ఉదయం 10.55 గంటలకు ఏయూలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రోలియం వర్సిటీ) వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. ఒంటి గంట వరకు అక్కడే ఉండి తరువాత సర్క్యూట్హౌ్సకు చేరుకుని రాత్రికి తిరిగి విజయవాడ పయనమవుతారు.