జమ్ము కాశ్మీర్లో దర్బార్ తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బివిఆర్ సుబ్రహ్మణ్యం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధానిని ప్రతియేటా ఆరు నెలలు శ్రీనగర్లోనూ, ఆరు నెలలు జమ్ములోనూ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం శ్రీనగర్ రాజధానిగా ప్రభుత్వం పని చేస్తున్నది. ఈ నెల 25, 26 తేదీలలో శ్రీనగర్లో కార్యాలయాలను మూసివేస్తారు. తిరిగి నవంబర్ 4న జమ్ములో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిస్తారు. జమ్ములోని అత్యధిక వేడిమిని, శ్రీనగర్లోని అత్యధికి చలిని తట్టుకుని పని చేయడానికి అనువుగా దర్బార్ తరలింపు విధానాన్ని 1872లో మహారాజా గులాబ్ సింగ్ ప్రారంభించారు.