చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీజీ సంకల్ప పాద యాత్ర నిర్వహించారు. బిజెపి రాష్ట్ర రధసారధి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నిగాంధీజీ సంకల్పపాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి కన్నా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావణిని సాధించే క్రమంలో, గాంధీ గారి 150 వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గాంధీ ఆశయాలను, సిద్ధాంతాలను దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్లేందుకు, హింసకు తావు లేకుండా ఈనాటి యువతరాన్ని చైతన్య పరచవలసిన ఆవశ్యకతను గుర్తించి “గాంధీజీ సంకల్ప యాత్ర” పేరుతో పాదయాత్రను ప్రారంభంచటం చాలా ఆనందంగా ఉందన్నారు.