అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో విశాలాంధ్ర విలేకరిపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డిని ఆదేశించిన రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ . ఘటనాస్థలానికి వెళ్ళి స్వయంగా వెళ్ళి విచారణను పరిశీలించాలని ఎస్పీకి ఆదేశాలు. ఈ కేసు విషయంలో ఎటువంటి తాత్సారం జరగకుండా స్వయంగా పర్యవేక్షించాలని, దోషులపై వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించిన డిజిపి. రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై జరిగే దాడులను ఎట్టి పరిస్తితులలో ఉపేక్షించేది లేదని, భాద్యులను చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరిక