రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో అమెరికా కాన్సుల్ ప్రతినిధులు సమావేశమై పలు అంశాలు చర్చించారు. బుధవారం అమెరికా కాన్సుల్ జనరల్ రీఫ్మెన్, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా గవర్నర్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేవ్ రాష్ట్రానికి తగిన రీతిలో సహకరించాలని గవర్నర్ వారికి సూచన చేసారు. అలాగే ఇరుదేశాల్లోని గవర్నర్ వ్యవస్థలపై కాన్సుల్ సభ్యులు, గవర్నర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అయితే అమెరికాలోని గవర్నర్ వ్యవస్థకు ఇక్కడికి పోలిక లేదని తెలిపిన బిశ్వభూషణ్ స్పష్టంచేసారు.