తుని ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్యకు నిరసనగా నెల్లూరులో జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ చేసారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో పాత్రికేయునికి నివాళులర్పించిన అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ జయప్రకాష్ మీడియాలో మాట్లాడుతూ జర్నలిస్టు హత్య అమానుషం అనాగరికం ఆటవిక చర్య అని ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తనకు రక్షణ కల్పించాలని నెలరోజులకు ముందే సత్యనారాయణ పోలీసులను కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడమే ఈ హత్య జరిగిందన్నారు. హత్యలతో బెదిరింపులతో కలానికి సంకెళ్లు వేయలేరని ఆయన అన్నారు.