రాజోలు మాజీ ఎమ్మెల్యే , జనసేన నేత అల్లూరి కృష్ణం రాజుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో... వైసిపిలో చేరారు. బుధవారం ఆయన తన అనుచరులతో కలసి సిఎం జగన్ ఇంటివద్ద పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ వారిని కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
2013లో వైసిపిలో చేరిన అల్లూరి గత ఎన్నికల సమయంలో టిక్కెట్ ఆశించారు. అది సాధ్యం అయ్యేలా కనిపించకపోవటంతో జనసేన చేరిపోయారు. అయితే అక్కడ రాపాక వరప్రసాద్కు టి్కెట్ దక్కడంలో ఆతని గెలుపులో కీలక భూమిక పోషించారు. రాష్ట్రంలో దాదాపు అన్ని స్ధానాలలో పోటీ చేసిన జనసేన తరపున గెలిచింది ఈ నియోజక వర్గ అభ్యర్దే.
జనసేన తరఫున రాజోలులో నెగ్గిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అడపాదడపా పార్టీ మీటింగుల్లో పాల్గొంటూ ఉన్నా ఆయన జనసేనను వీడతారనే ప్రచారమూ ఉంది. అయితే దాన్ని ఆయన ఖండిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో జగన్ పాలనను ఆయన నిర్మొహమాటంగా ప్రశంసించడంతో చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
అయితే కొద్ది రోజులుగా రాపాక- అల్లూరిల మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరిన నేపథ్యంలో తనే ముందుగా వైసిపిలోకి జంప్ చేస్తే బెటరని ఆదిశగా అనుచరులతో ఆలోచన చేసి తిరిగి వైస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ పథకాలు చాలా బాగున్నాయి..అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు... వీటిని గ్రామగ్రామాన ప్రచారం చేసి రాబోయే రోజుల్లో రాజాలులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం అన్నారు ఈ సందర్భంగా అల్లూరి కృష్ణంరాజు.