మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మజ్జి శారద వేకువ ఝామున హైదరాబాద్ రామంతాపూర్ లో గుండెపోటు తో మృతి చెందారు.
ఉమ్మడి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్ కుమార్తె అయిన ఆమె ఉపాధ్యాయినిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పూర్తిగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన ఆమె, ఆ జిల్లాలో అనేక ప్రాంతాలలో పనిచేసారు. ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా నిలబడి, వారిని ఎంతో ప్రోత్సహించారు. తదుపరి . గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం రావటంతో టీచర్ పోస్టుని వదులుకున్నారు. అయితే 1994లో తండ్రి మరణంతో ఆమె కాంగ్రెస్ లో ఆయన వారసత్వం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2007లో పార్టీ ఆమెను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఆమె ఉమ్మడి రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.