ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా హత్య కేసులో తప్పుడు ప్రచారం చేస్తే నోటీసులు : గౌతమ్‌ సవాంగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 02:41 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కేసు విచారణ జరుగుతోందని.. ఈ కేసుపై తప్పుడు ప్రచారం చేసే వారికి నోటీసులు పంపుతామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. విజయవాడ పోలీసు కార్‌ గ్రౌండ్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్‌ సీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి డీజీపీ ఆయుధ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సవాంగ్‌ మాట్లాడుతూ.. అక్టోబర్‌ 21న ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తామన్నారు. పోలీసులు చేసే త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసమే ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మూడు నెలల వ్యవధిలో వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో చాలా చేశామన్నారు. రాజకీయంగా మాట్లాడేదానికీ, కేసు విచారణకు తేడా ఉందని.. అనవసరపు మాటలు కేసు విచారణను ప్రభావితం చేస్తాయని డీజీపీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com