అమరావతి : విశాఖపట్టణంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తుమ్మలపల్లి గ్రామంలో 40 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని ఆటోలో తరలిస్తుండగా దాన్ని స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను, వారి నుంచి రూ. 33 వేలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్టు అయిన నలుగురు వ్యక్తులు కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.