ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదో తెలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 06:56 PM

చిరంజీవి కథానాయకుడుగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కించిన తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమా ఇటీవల గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో ఈ సినిమా లేకపోవడంతో, మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరిచారు. ఇక ప్రస్తుతం పర్వాలేదనిపించేలా ముందుకు సాగుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు కిచ్చ సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, భోజ్ పురి నటుడు రవికిషన్, విలక్షణ నటుడు జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా తన నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించారు. 


ఇకపోతే ఈ సినిమాను ఇటీవల వీక్షించిన తమిళనాడు గవర్నర్ తమిళసై సౌందరరాజన్, సినిమాపై అలానే మెగాస్టార్ చిరంజీవి నటనపై ఎంతో అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. ఇకపోతే నేడు మెగాస్టార్ మరియు ఆయన సతీమణి సురేఖ గారు, ఆంధ్ర రాజధాని అమరావతి చేరుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైరా సినిమా చూడవలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం, తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేరుకున్న మెగాస్టార్ దంపతులు, ఆయనను ప్రత్యేకంగా సైరా వీక్షించ వలసినదిగా కోరినట్లు, అందుకు సీఎం గారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com