పాత రాజరాజేశ్వరీ పేట రైల్వే స్థలం లో నివసిస్తున్న నివాసితులకు ఇళ్ళ పట్టాలు.గత నలభై సంవత్సరాలుగా 49 డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటలో నివాసముంటున్న వారి సమస్య శాశ్వత పరిష్కారానికి వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇందులో భాగంగా సోమవారం దేవదాయ శాఖ మంత్రి స్థానిక ఎమ్ఆర్ఓ సుగుణ మరియు సంబంధిత అధికారులతో కలిసి 49వ డివిజన్లో పర్యటించారుస్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఐదు వందల యాభై ఇల్లు కు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి తో మాట్లాడి రైల్వే అధీనంలో ఉన్న స్థలాల లో నివసిస్తున్న స్థానికులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
49వ డివిజన్ అల్లు జయలక్ష్మీ నగర్ వాసులు మంచినీటి అవసరాలు తీర్చే నిమిత్తం దాదాపు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మంచినీటి పైప్ లైన్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ అప్పాజీ, డివిజన్ ప్రెసిడెంట్ రబ్బానీ, నాయకులు బత్తుల పాండు, బాబు, శ్రీనివాస రెడ్డి, గొలగాని శ్రీను, సర్దార్, నాయక్, లక్ష్మణ్, లత, పద్మ, రెజీనా తదితరులు పాల్గొన్నారు..