అమరావతి : శ్రీకాకుళంలో విద్యుత్ వైర్లు తెగి పడటంతో అవి తగిలి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది.అర్ధరాత్రి సూరివాసవీధిలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అవి తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను సోమేష్, లోకేష్గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.