గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న. వైసిపి సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కడప జిల్లా ప్రొద్దూటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ పనేనని సిట్ అధికారులు నిర్ణయించారు. .వివేకా హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సిట్ అందులో భాగంగా సుమారు 800 మందిని విచారించి, వైఎస్ వివేకాది సుపారీ హత్యగా దర్యాప్తు సిట్ తేల్చింది. కొద్ది రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన శ్రీనివాసరెడ్డి నిందితులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా సిట్ అధికారులు నిర్ధారించారు. శ్రీనివాసరెడ్డి మరణంతో తమ అనుమానాలు మరింత బలపడ్డాయని ఆకోణంలో విచారణ జరిపితే నిందితులు వాడిన బైక్ వివరాలు తెలిసాయని, వాటి ఆధారంగా ఈ కేసు కొలిక్కి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టినట్టు చెప్పారు. కాగా అసలు ఎవరి కోసం శ్రీనివాసరెడ్డి ఈ సుపారీ ఇచ్చారనే అంశం తేల్చే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారన్న పనిలో సిట్ ఉందిప్పుడని వినిపిస్తోంది.