ప్రేమించానని బాలిక వెంటపడ్డాడు. చివరకు అతని మాయ మాటలో పడి అతనితో పెళ్లికి ఒప్పుకుంది. రాత్రి గుడి దగ్గర పెళ్లి చేసుకొని తెల్లారే సరికి కనిపించకుండా మాయమయ్యాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంటపడ్డాడు. చిన్నగా బాలికను ప్రేమ ముగ్గులోకి దింపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నవీన్ ను నమ్మిన బాలిక పెళ్లికి సిద్దమయ్యింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని కొండ వద్ద ఉన్న గుడి దగ్గరకు బాలికను తీసుకెళ్లాడు. గుడి దగ్గర తాళి కట్టాడు. ఇద్దరూ కలిసి రాత్రి అక్కడే నిద్రపోయారు. శుక్రవారం ఉదయం బాలిక లేచి చూసే సరికి వెంకటేష్ కనిపించలేదు. ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.