తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో శనివారం 7 అడుగుల నాగుపాము పట్టుబడింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోని అడవి నుంచి ఓ దుకాణంలోకి ఈ పాము చొరబడింది. గుర్తించిన దుకాణదారులు పాములుపట్టే టీటీడీ ఉద్యోగి భాస్కర్నాయుడికి సమాచారమిచ్చారు. వెంటనే ఆప్రదేశానికి చేరుకున్న ఆయన తన వద్దనున్న పరికరాలతో పామును పట్టుకుని, అవ్వాచారి కోనలో వదిలిపెట్టారు. తిరుమల కొండల్లో ఇటీవల పట్టుబడిన నాగుపాముల్లో అతి పొడవైన పాము ఇదేనని తెలిపారు.