ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మృతదేహాలను వెలికి తీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు.