ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తను కర్రతో కొట్టి చంపేసిన భార్య...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2019, 01:18 PM

శ్రీకాకుళంలోని  టెక్కలి మండలం పాత నౌపడలో దారుణం చోటు చేసుకుంది. ఆత్మ రక్షణ కోసం ఓ భార్య తన భర్తను కొట్టి చంపేసింది. నౌపడకు చెందిన వెంకటరమణ, జగదీశ్వరి దంపతుల మధ్య నిన్న రాత్రి గొడవ జరిగింది. మద్యం తాగి వచ్చి కొడుకు, భార్యని కిరోసిన్ పోసి చంపేస్తానని వెంకటరమణ బెదిరించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జగదీశ్వరి తన భర్త వెంకటరమణను కర్రతో కొట్టి చంపేసింది. తీవ్ర రక్త స్రావంతో అతను మృతి చెందాడు. వెంకట రమణ రైల్వే ట్రాక్ మన్‌గా పని చేసేవాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com