శ్రీకాకుళంలోని టెక్కలి మండలం పాత నౌపడలో దారుణం చోటు చేసుకుంది. ఆత్మ రక్షణ కోసం ఓ భార్య తన భర్తను కొట్టి చంపేసింది. నౌపడకు చెందిన వెంకటరమణ, జగదీశ్వరి దంపతుల మధ్య నిన్న రాత్రి గొడవ జరిగింది. మద్యం తాగి వచ్చి కొడుకు, భార్యని కిరోసిన్ పోసి చంపేస్తానని వెంకటరమణ బెదిరించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జగదీశ్వరి తన భర్త వెంకటరమణను కర్రతో కొట్టి చంపేసింది. తీవ్ర రక్త స్రావంతో అతను మృతి చెందాడు. వెంకట రమణ రైల్వే ట్రాక్ మన్గా పని చేసేవాడు.