ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏలూరులో రూ.266 కోట్ల వ్యయంతో నిర్మించే ప్రభుత్వ వైద్య కాలేజీకి శుక్రవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఎన్నిక మేనిఫెస్టోలో పేర్కొన్న వైఎస్ ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా కార్లు, ఆటోలు నడుపుతున్న వారికి ఏడాదికి రూ.10వేలు సాయం అందించనున్నారు.