కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా మల్లిఖార్జున పల్లిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సుపై విద్యుత్ స్తంభం పడటంతో ప్రయాణికులు కేకలు వేస్తూ కిందికి దూకేశారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు బళ్లారి నుంచి కల్యాణదుర్గం వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని విద్యుత్ స్తంభాన్ని తొలగించేందుకు సాయపడ్డారు.