ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోహిని అవతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2019, 11:51 AM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామి వారు మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు. దీంతో తిరుమల క్షేత్రం గోవిందనామ స్మరణతో మారుమోగుతోంది. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ రాత్రి గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.


తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దసరా సెలవులతో పాటు… స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. సర్వదర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com