కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల కేంద్రంలో వడ్డీల రామాలయం వద్ద ప్రభుత్వ మద్యం షాపు ఏర్పాటును మహిళలు వ్యతిరేకించారు. షాపు ఏర్పాటును వారు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం నుండి వడ్డీలు పేటకు చెందిన మత్స్యకారులు , మహిళలు ధర్నా నిర్వహించారు. షాపును ఏర్పాటు చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, వివిధ పక్షాల నాయకులు పాల్గొన్నారు.