తూర్పుగోదావరి జిల్లా, అమలాపురంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలు పరస్పరం మారణాయుధాలతో దాడులు చేసుకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. అమలాపురానికి చెందిన విప్పర్తి రవికుమార్పై దువ్వా వెంకన్న, షేక్ యోహాన్, సాయి, లక్ష్మణ్, వారాది చందులు మారణాయుధాలతో దాడి చేశారు. అమలాపురం ఈదరపల్లి వంతెన నుంచి వెంటాడారు. యాక్సెస్ బ్యాంక్ వద్దకు రాగానే దాడి చేశారు. రవికుమార్ సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పాత కక్షలు కారణంగానే ఈ గొడవ జరిగినట్లు భావిస్తున్నారు. రెండు వర్గాలపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే రాజీ కుదరకపోవడంతో దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.