బోటు ప్రమాదంలో 36 మృతదేహాలను వెలికితీశామని కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. ఇంకా 16 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉందన్నారు. ఏపీకి చెందిన 8 మంది, తెలంగాణకు చెందిన 8 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని చెప్పారు. 26 మందిని రక్షించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. మృతులకు డెత్ సర్టిఫికెట్ల కోసం పంచాయతీలకు ప్రత్యేక అనుమతి ఇచ్చామన్నారు. బోటు ప్రమాదంపై హైలెవల్ టెక్నికల్ కమిటీ సమావేశం జరిగిందన్నారు. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్కు బోటు వెలికితీసే పనులు అప్పగించమని చెప్పారు. బాలాజీ మెరైన్స్కు ఈ రంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. బోటు వెలికితీయడానికి రూ.22.70 లక్షలు ఖర్చు పెట్టామని కలెక్టర్ తెలిపారు.