గత కొద్దీ రోజుల కిందట గోదావరిలో బోటు ప్రమాదం గురించి మనకు తెలిసిందే. ఇన్ని రోజులు అయినా ప్రభుత్వం ఇంకా బోటును ఎందుకు బయటికి తీయలేదు అన్న విషయం పై మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. గోదావరిలో మునిగిన బోటును ఎందుకు బయటకు తీయట్లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బోటు బయటకు వస్తే లోపాలు బయటపడతాయనే భయపడుతున్నారని ఆరోపించారు.