తూర్పు గోదావరి జిల్లా సర్పవరంలో దుర్గామాత విగ్రహాలను ధ్వంసం చేశారు కొందరు దుండగులు. విగ్రహాలను తయారీ చేసే షాపులో అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు 20 దుర్గామాత విగ్రహాల భాగాలను విరగొట్టి పడేశారు. ఈ ఘటన మతపరమైన గొడవలు కాకుండా విగ్రహాల తయారీలో పోటీతోనే జరిగివుండొచ్చని సర్పవరం పోలీసులు అంటున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.