కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఆర్టీజీఎస్ భారీ వర్ష సూచన చేసింది. ఈ రెండు జిల్లాలలో ఈరోజు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలలో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని, కోస్తా, రాయలసీమ మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని సూచించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.