గోదావరిలో మునిగిపోయిన బోటును 2 గంటల్లో బయటకు తీస్తానని సహస వీరుడు జీవీ శివ చెప్పాడు. బోటు ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ.. బోటును బయటకు ఎలా తీసుకురావాలో తనకు బాగా తెలుసన్నాడు. గోదావరిపై తనకు పూర్తి అవగాహనం ఉందని చెప్పాడు. కానీ అధికారులు మాత్రం అందుకు అంగీకరించట్లేదన్నాడు. బోటు బయటకు వస్తే అధికారుల భాగోతం బయటపడుతుందని ఆరోపించాడు. బోటు పైకి ఎలా తీసుకురావాలో మ్యాప్ ద్వారా వివరించాడు. తనకు అధికారులు సహకరిస్తే... కచ్చితంగా బయటకు తీస్తానని ధీమా వ్యక్తం చేశాడు.