పశ్చిమ గోదావరి జిల్లా, ఏలేరు నది పరివాహక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి సుమారు ఐదు వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుంది. 86.56 మీటర్ల స్థాయి లో 24.1 1 టీఎంసీల సామర్ధ్యం గల ఏలేరు రిజర్వాయర్ లో ప్రస్తుతం 86.05 మీటర్ల స్థాయిలో 23.06 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడానికి కేవలం 0.56 మీటర్లు మాత్రమే ఉంది. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే మాత్రం అత్యవసరంగా గేట్లు ఎత్తే పరిస్థితి ఉంది. ఈమేరకు గేట్ల సెక్షన్ జూనియర్ ఇంజనీర్ చౌదరి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు కురిసి వరద నీరు తీవ్రత పెరిగితే దిగువ ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేస్తామని ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ అధికారులకు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.