బీహార్లో గంగానది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నది. దీనితో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గాంధీ ఘాట్ వద్ద గంగానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఘాట్ వద్దకు ప్రజలను రానీయడం లేదని అక్కడ కాపలాగా ఉన్న స్థానికుడొకరు చెప్పారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఇక్కడకు ఎవరినీ రానీయడం లేదని అతడన్నాడు.