న్యూఢిల్లి : ఢిల్లి ప్రత్యేక పోలీసులు భారీ మొత్తంలో మాదక ద్రవ్యం హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 40 కోట్ల రూపాయిలు ఉంటుందని వారు చెప్పారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మణిపూర్నుంచి ఢిల్లికి స్కార్పియో వాహనంలో మాల్దా బరైలీ మార్గం ద్వారా హెరాయిన్ను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.