శరవేగంగా దేశమంతా ఉల్లిధరలు పెరుగుతున్న వేళ సామాన్యులలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సేకరించిన ఉల్లిని మొబైల్ వ్యాన్ల ద్వారా ఢిల్లీ వాసులకు సరఫరా చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరఫరా చేస్తామన్నారు.
సోమవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో కిలో ఉల్లి రూ.70-80 పలుకుతోందని, ఇది చాలా అధికమేనని, అందుకే కేజీ 24 రూపాయలకే ప్రభుత్వమే సరఫరా చేసేలా నిర్ణయం చేసామన్నారు. ఇందుకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియ ఆరంభమైందని, త్వరలో పూర్తి సరఫరా దారులతో ఒప్పందం కుదుర్చుకుని సామాన్యులకు నేరుగా సరఫరా చేస్తామనిస్పష్టం చేసారు.
మరోవైపు రాజధాని చీకటిలో మగ్గుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తాలపై ఆయన స్పందించారు. వివిధ ప్రదేశాల్లో 2.1 లక్షల వీధి లైట్లు అమర్చాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. సూర్యకాంతి ద్వారా నియంత్రించే సెన్సర్ల ఆధారంగా ఈ లైట్లు పనిచేస్తాయన్నారు. ఒక్కో డిస్కం పరిధిలో 70 వేల వీధిలైట్లు అమర్చనున్నట్టు వెల్లడించారు. నవంబరు 1 నుంచి వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.