కేసులకు భయపడి ముద్రగడ ఉద్యమాలు చేయడం లేదని, ఆయనకు దమ్ముంటే బయటకు వచ్చిన ఉద్యమం చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాయడం వల్ల ప్రయోజనం లేదని, మీ లేఖలు, మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరన్నారు. టీటీడీ పాలకమండలి జెంబో జెట్లా ఉందని అన్నారు. ఏపీ కన్నా ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ ఉన్నారన్నారు. నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.