ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గీతానందలహరి పుస్తకంపై విచారణకు ఈవో ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 09:26 PM

టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత సమాచారం ఉన్నట్లు గుర్తించామని.. సైట్ నుంచి టీటీడీ ముద్రించిన భక్తి గీతానందలహరి పుస్తకం ఆ పుస్తకాన్ని తొలగించామని ఈవో స్పష్టం చేశారు. దీనిపై విచారణకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విచారణకు ఆదేశించారు. పింక్ డైమండ్ లేదని గతంలోనే చెప్పామని.. సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో 20 అంశాలపై చర్చించామని అనిల్ తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనంపై ఫైనాన్షియల్ కమిటీని నివేదిక కోరామని, ఉద్యోగుల కోసం రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి టీటీడీ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా రద్దు చేస్తున్నామని, ఉత్తీర్ణత ఆధారంగానే విద్యార్ధులకు సీట్లను కేటాయిస్తామని సింఘాల్ పేర్కొన్నారు. టీటీడీ కాలేజీలు, హాస్టళ్ల కోసం రూ.100 కోట్లు కేటాయించామని, నిబంధనల ప్రకారం బర్డ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ జగదీశ్‌ పదవికాలం పొడిగింపునకు అవకాశం లేదని అనిల్ స్పష్టం చేశారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com