గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే రూ.4358 కోట్ల మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రూ.628 కోట్లు నిధుల ఆదా అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4358 కోట్లకు టెండర్ దాఖలు చేసింది. జ్యూడిషియల్ కమిషన్ అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి టెండర్ను పిలిచింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయాంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్లి, పోలవరం హెడ్వర్క్స్ తో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది.