బెజవాడ ప్రభుత్వ హాస్పిటల్ రోగులతో కిటకిటలాడుతున్నది. ప్రభుత్వ హాస్పిటల్ లో 45 డెంగ్యూ కేసుల నమోదు అయ్యాయి. ప్రతిరోజూ 1300 నుంచి 1350 వరకు కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 1092 విష జ్వరాల కేసులు నమోదు అయ్యాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో 80 టైఫాయిడ్ కేసుల నమోదు అయ్యాయి. వైరల్ ఫివర్స్ నేపథ్యంలో హాస్పిటల్ వైద్యులు ప్రత్యేక వార్డ్స్ ను ఏర్పాటు చేశారు. ఖమ్మం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు.