పిఠాపురానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ అల్లభాని మహేశ్వరరావు(43) విధినిర్వహణలో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన కాకినాడ డిపో పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ద్వారంపూడి - రాజమండ్రి సర్వీస్ డ్యూటీ చేస్తుండగా రాత్రి చివరి ట్రిప్ లో కాకినాడ డిపోకు వస్తుండగా బస్సులో ఆయన గుండెపోటుకు గురయ్యారు. మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మహేశ్వరరావు 20 సంవత్సరాలుగా ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తున్నారు. కాకినాడ డిపో మేనేజర్ భాస్కరరావు, ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఇంట్లో ఒకరికి ఉద్యోగం, కుటుంబానికి ఆర్టీసీ ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.