రెండ్రోజుల్లో మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసి కొరత లేకుండా చూస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. కొందరు వ్యాపారులు కావాలనే ఉల్లిని బ్లాక్ మార్కెట్ కు తరలించి కృత్తిమ కొరత సృష్టించారని, దీన్ని ఊపేక్షించేది లేదన్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిధరలు అమాంతం పెరగడంపై అధికారులతో మంత్రి మోపిదేవి సమీక్ష నిర్వహించారు. సామాన్య ప్రజలకు అందుబుటులోకి ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.