పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ప్రజా ధనాన్ని కాపాడుతానని గతంలో చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిలిపివేశారు. దీంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా డేంట్ కేర్ అనుకుంటూ తాను చేయాల్సింది చేసుకుంటూ పోయారు. తాజాగా జరిగిన పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో దాదాపు రూ.686 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ కనెక్టివిటీ 65వ ప్యాకేజీ పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో రూ.58 కోట్లు ఆదా చేశారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. మేఘాకు హెడ్ వర్క్స్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, జల విద్యుత్ పనులు దక్కాయి. రూ. 4,987 కోట్ల ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువను ప్రభుత్వం నిర్ధారించగా రూ. 4,358 కోట్లను కోట్ చేసి ఎల్-1గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిలవడంతో పనులు దక్కాయి.