చిత్తూరు జిల్లా దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పుంగనూరు మండలం జట్టి గుండ్ల పల్లి గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకు వెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్టుగా తెలిసింది. బాధితురాలి తాత ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చేసినట్టు సమాచారం. 12 రోజుల క్రితం ఘటన జరుగగా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి కుటుంబసభ్యులు చెపుతున్నారు. అవమానం భరించలేక భాదితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. 11 రోజులు నుండి కర్ణాటక కోలార్ లోని పి.ఇ.యస్ హాస్పిటల్లొ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు కోలార్ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగాయి. చిత్తూర్ లు కాకుండా పక్క రాష్ట్రానికి తీసుకు వచ్చి చికిత్స అందించాల్సిన అవసరం ఏం ఉందని.. అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులను 12 రోజులు గడుస్తున్న ఎందుకు గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు ఎస్.ఐ. అరుణ్ కుమార్ రెడ్డి ను వివరణ కోరగా తమ దృష్టికి ఎటువంటి కేసు రాలేదని చెబుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఫిర్యాదు చేశామని... మాకు న్యాయం చేయడం లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.