ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ పాలకమండలి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 02:31 PM

తిరుమల: తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం జరగుతోంది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరుగుతోంది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ నిధుల కుదింపుపై చర్చిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై కూడా చర్చిస్తున్నారు. రూ.100 కోట్లతో తిరుపతి లో హాస్టల్‌ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలపనుంది. రూ.79 కోట్లతో తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం-5 నిర్మాణానికి టీడీపీ బోర్డు ఆమోదం తెలపనుంది. తిరుపతిలో గరుడవారధి నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులు కేటాయింపునకు బోర్డు ఆమోదం తెలపనుంది. శ్రీవారి ప్రసాదం ముడిసరుకుల కొనుగోలు అంశంపై, సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బోర్డు చర్చించనుంది.  సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణం, బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి అవిలాల ట్యాంక్‌ అభివృద్ధి నిధులు, టీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సబ్‌కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అమరావతి శ్రీవారి ఆలయానికి కేటాయించిన రూ.150 కోట్లను రూ.36 కోట్లకు కుదిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత గరుడ వారధికి నిధులు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com