ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆదిత్య నాద్ దాస్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఐఏఎస్ ఆదిత్యనాద్ దాస్ కు నోటీసులు జారీ చేసింది. కేసు నుంచి ఆదిత్యనాద్ ను తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆదిత్యనాద్ దాస్ కు నోటీసులిచ్చింది.