రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోటు ప్రమాదం జరిగి 40 మంది పైగా మృతి చెందారన్నారు. ఇప్పటికీ బోటును బయటికి తీసుకురాని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు.