సమాజంలో పెత్తందారీ తనాన్ని ప్రశ్నించడమే హక్కుల ఉద్యమ లక్ష్యమని మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ పేర్కొన్నారు. మానవ హక్కుల వేదిక జిల్లాశాఖ 6వ మహాసభ అమలాపురం కిరాణామర్చంట్స్హాలులో జిల్లా ప్రధాన కార్యదర్శి నామాడి శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో వ్యవస్థీకృత అసమానతలు, అణచివేతలు హక్కుల లేమికి మూలకారణమన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కొనసాగుతున్న పెత్తనాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా హక్కుల ఉద్యమకారులు ముందుకుసాగాలన్నారు.