ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ మూడు రోజుల ఒడిశా పర్యటన సందర్భంగా ఆదివారం ఉదయం భువనేశ్వర్ నందు లింగరాజు ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి గవర్నర్ హరిచందన్ ఒడిశా పర్యటనకు వెళ్లారు. బిస్వ భూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పదవి చేపట్టిన సందర్భంగా ఆయన గౌరవార్థం స్థానిక నాయకులు రవీంద్ర మండప్ లో పౌర సన్మానం ఏర్పాటు చేశారు.