జార్ఖండ్ పోలీసు విభాగంలోని యాంటి టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అధికారులు ఒక ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న మొహమ్మద్ కలీముద్దీన్ ముజాహిరి అనే ఉగ్రవాదిని ఎటిఎస్ అధికారులు అరెస్టు చేశారు. అల్-కాయిదా ఉగ్రవాద సంస్థతో అతడికి సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్లోని అల్ కాయిదా ఉగ్రవాదుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన ముజాహిరిని టాటానగర్ రైల్వే స్టేషన్లో ఎటిఎస్ సిబ్బంది అరెస్టు చేశారు.