గ్రామసచివాలయ ఉద్యోగార్ధులకు శుభవార్త గ్రామసచివాలయ ఉద్యోగాలకి సంబంధించి అభ్యర్ధులకు ఎలాంటి ఇంటర్యూలు ఉండవని విశాఖ జెడ్పీ సీఈఓ రమణమూర్తి తెలియజేశారు. విశాఖలో ఆయన సోమవారం ఉదయం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఒక్క ఉద్యోగానికి ఒక అభ్యర్ధికి మాత్రమే సెల్ ఫోన్ వర్తమానం పంపుతున్నామన్నారు. అదేవిధంగా మెరిట్ లిస్టు కూడా ప్రదర్శన జరుగుతుందన్నారు. అభ్యర్ధులు ఎన్ని ఉద్యోగాలకు అర్హత సాధిస్తే అన్నింటికీ కాల్ లెటర్లు పంపనున్నట్టు చెప్పారు. వారంతా తమ సర్టిఫికేట్లను ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంటుందని ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఎట్టపరిస్థితిలో ఉండబోదని స్పష్టం చేసారు.